సిరాన్యూస్, బోథ్
బోథ్ మార్కెట్ యార్డులో జొన్న పంట కొనుగోలు ప్రారంభం
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మార్కెట్ కమిటీ ఆవరణలో సోమవారం జొన్న పంట కొనుగోలు కేంద్రాన్ని సహకార సంఘం సీఈవో ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సహకార సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో కొనుగోలు చేస్తున్న జొన్నలకు క్వింటాలకు 3180 చెల్లించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి మనోహర్, ఏవో వెండి విశ్వామిత్ర, ఏఈఓ సంతోష్, వాజిద్, సహకార సంఘం కార్యదర్శి గోలి స్వామి, బి నాగభూషణం, ఎస్ ప్రవీణ్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు.