సిరా న్యూస్,మండపేట;
మండపేట మండలం ఇప్పనపాడు గ్రామంలో అగ్నిప్రమాదం జరిగి వ్యాన్ దగ్నమై భారీ ఆస్తి నష్టం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ద్వారపూడి నుండి ఇప్పనపాడు సతి ఆరంజ్యోతి రైస్ మిల్ ఎదురుగా ఉన్న ఏరోప్లేక్స్ పరుపుల గోడౌన్ లోకి రీబాండెడ్ పరుపుల మెటీరియల్ను తీసుకుని వెళుతుండగా పైన ఉన్నటువంటి కరెంటు వైర్లు తగలడంతో నిప్పు అంటుకుంది. దీనిని గమనించిన అక్కడ కార్మికులు వ్యాన్ డ్రైవర్ కి చెప్పడంతో హుటాహుటిన ద్వారపూడి వైపు ఖాళీ స్థలంలోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. అప్పటికే మంటలు వేగంగా చేలరేగడంతో రోడ్డుపైనే వ్యాన్ నిలిపేసారని తెలిపారు. సంఘటన స్థలానికి మండపేట అగ్నిమాపక సిబ్బంది అనపర్తి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టం సుమారు 20 లక్షల వరకు ఉంటుందని అంచనా, ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో కొంత సమయం ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది.
======================