సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
పారిశుద్ధ్య పనులను పరిష్కరించాలి : ఆర్టీసీ డిపో మేనేజర్
* ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ కు వినతి
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని బస్టాండ్ పరిసర ప్రాంతంలో పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలని సోమవారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ను ఖానాపూర్ ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ బస్టాండ్ పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను చేయిస్తామని, చెత్తా చెదారంను ప్రజలు తిరిగే ప్రదేశాలలో రోడ్ల పైన వేయకుండా చెత్త డబ్బాలలో వేసేటట్లు ఆర్టీసీ సిబ్బంది చూడాలని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కిషోర్ నాయక్ , తది తరులు పాల్గొన్నారు.