సిరాన్యూస్, సొనాల
* బీజేపీ ప్రచార సామాగ్రి పంపిణీ
* బోథ్ బీజేపీ మండల అధ్యక్షుడు బోరే రవీందర్
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సోనాల చుట్టూ పక్కల గ్రామాలైన ఘన్పూర్, చింతల బోరీ, వజ్జర్, కౌటా, సంగ్వి , పార్డి (కే),కనుగుట్ట, పోచ్చెర గ్రామాలలో సోమవారం బీజేపీ ప్రచార సామాగ్రి పంపిణీ చేశారు. ఈసందర్బంగా బోథ్ బీజేపీ మండల అధ్యక్షుడు బోరే రవీందర్ మాట్లాడారు. స్టిక్కర్లు, పాంప్లెంట్లు, క్యాలెండర్ అందించామన్నారు. మిగతా గ్రామాలకు కూడా అందివ్వడం జరుగుతుందనిన తెలిపారు. రేపటినుండి ప్రతి గ్రామంలో ప్రచారం చేయడం జరుగుతుందని తెలిపారు.. ప్రతి ఒక్కరూ కంకణ బద్ధులై మన పార్లమెంట్ అభ్యర్థి గోడం నాగేష్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రతి ఒక్కరు ప్రతి పనిని తన భుజాలపై వేసుకొని బోథ్ మండలంలో మిగతా మండలాలలో కన్నా ఎక్కువ మెజారిటీ వచ్చేలా పనిచేయాలన్నారు. కార్యక్రమములో సీనియర్ బీజేపీ నాయకులు సుభాష్ సూర్య ,కార్యకర్తలు పాల్గొన్నారు.