సిరాన్యూస్,ఆదిలాబాద్
రిమ్స్ ను తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిని సోమవారం సాయంత్రం జిల్లా పాలనాధికారి రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా రిమ్స్ లోని ప్రతి వార్డును పరిశీలించారు. ఓ పి గది, గిరిజన వైద్య ఆరోగ్య సేవల సహాయక కేంద్రం, మెటర్నిటి వార్డ్, ఐసీ యు, తదితర గదులను పరిశీలించారు. పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లను తనిఖీ చేసి షిఫ్ట్ వారిగా వైద్యుల విధులను పరిశీలించారు. పేషెంట్ కేర్, స్విపర్స్ ఎంత మంది పనిచేస్తున్నారు, ఈరోజు విధులకు ఎంతమంది హాజరయ్యారని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి కలయతిరుగుతూ పేషంట్ల తో మాట్లాడుతూ వారి బాగోగులను అడిగి తెలుసుకొని ట్రీట్మెంట్ ఎలాఉంది, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రాథోడ్ జైసింగ్, వైద్యాధికారులు, తదితరులు ఉన్నారు.