సిరాన్యూస్,భీమదేవరపల్లి
ఈనెల 21న కురుమ సంఘం మండల కమిటీ ఎన్నిక
* జిల్లా కన్వీనర్ చేవెల్ల మల్లయ్య
కురుమలంతా ఐక్యంగా ఉండాలని, కురుమల హక్కుల కొరకు ఏకతాటిపై నిలబడాలని హనుమకొండ జిల్లా కన్వీనర్ చేవెల్ల మల్లయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 21 ఆదివారం రోజున ముల్కనూర్ ఎస్ఆర్కె స్కూల్లో మండల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముత్త సంపత్ కురుమ ఆదేశానుసారం, మండలంలోని కురుమ కుల బాంధవులంతా హాజరై మండల కమిటీ ఎంపికలో సహకరించాలని కోరారు.