సిరాన్యూస్, పెంబి
పెంబిలో ఆరు టన్నుల బెల్లం స్వాధీనం :ఎక్సైజ్ సీఐ లక్ష్మణ్
నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రం లో సోమవారం అబ్కారి ఎన్ ఫోర్స్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. మండల కేంద్రంలో ఒక్క దుకాణం లో నిల్వ ఉంచిన ఆరు టన్నుల బెల్లం, ఒక్క టన్ను పట్టిక ను స్వాధీనం చేసుకున్నారు. దుకాణ యజమాని పై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ లక్ష్మణ్ తెలిపారు. అక్రమంగా అమ్మేనా వారి పై కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమం లో ఎన్ ఫోర్స్ సి ఐ గంగారెడ్డి, అక్బరుద్దీన్, డి టీ ఆఫ్ సి ఐ సింధు, ఎస్ ఐ అభిషేక్ సిబ్బంది ఉన్నారు.