సీతారాముల కళ్యాణంలో హిజ్రల హంగామా

సిరా న్యూస్,వేములవాడ;
రాజన్న సిరిసిల్ల జిల్లా. హరిహర క్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల కళ్యాణం లో హిజ్రాలు హంగామా చేస్తారు. శ్రీరామనవమి రోజున వేములవాడకు దాదాపు లక్షకుపైగా శివపార్వతులు, జోగిని లు, హిజ్రాలు, భక్తులు వస్తుంటారు. సీతారాముల కళ్యాణం జరుగుతున్న సమయంలో తాము కూడా శివుడిని పెళ్ళాడుతామంటూ ఒకరిపై ఒకరు అక్షింతలు వేసుకుంటారు. అలాగే ఒకరి మెడలో ఒకరు తాళి కట్టుకుంటారు. దేశంలో ఎక్కడా లేని వింత ఆచారం ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున వేములవాడకు వస్తామని తమ జీవితం శివునికి అర్పిస్తూ, తనతోనే వారి జీవితం అంటూ తెలుపుతారు. మిగతా సమయంలో రాజన్న ప్రచారం చేస్తామని చెప్పారు. శ్రీరామనవమి వేడుకలకు ముంబై, కలకత్తా, గోవా, హైదరాబాద్, బెంగళూరు తదితర పట్టణాల నుండి వందలాది మంది జోగినిలు వేములవాడ చేరుకొని దాదాపు వారం రోజులపాటు తన్మయత్వంలో మునిగితేలుతారు. కాగా, శివపార్వతులు కళ్యాణ సమయంలో చేతిలో త్రిశూలానికి బాసింగం కట్టి ఊపుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *