మద్దతు ధరపై కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి

అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్

 సిరా న్యూస్,పెద్దపల్లి;
నాణ్యమైన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో మద్దతు ధరపై కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో యాసంగి 2023-24 ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ నాణ్యమైన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో మద్దతు ధరపై రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో భారత ఆహార సంస్థ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను తూచ తప్పకుండా పాటించాలని అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రైస్ మిల్లర్లు ఎటువంటి కోత లేకుండా ధాన్యం దిగుమతి చేసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి శ్రీమాల, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కే.రవీందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
=====================xxcc

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *