ఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామి బ్రహ్మోత్సవాలకు ఏకశిలానగరం ముస్తాబు

ఏప్రిల్ 22న సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం

– ఏప్రిల్ 17న ధ్వజారోహణం

 సిరా న్యూస్,తిరుపతి;
క‌డ‌ప‌ జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆల‌యంలో ఏప్రిల్ 17 నుండి 25వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న బ్ర‌హ్మోత్స‌వాలకు వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఏకశిలానగరం ముస్తాబైంది. ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు తీర్చిదిద్ది వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకునేలా విద్యుత్‌ దీపాలంకరణలు చేప‌ట్టారు.

బ్ర‌హ్మోత్స‌వాల‌లో ప్ర‌తి రోజు ఉద‌యం

7.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న సేవ‌లు జ‌రుగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *