సిరాన్యూస్, ఖానాపూర్
సీతారాముల ఆలయ నిర్మాణానికి భూమి పూజ : మున్సిపల్ చైర్మన్ దంపతులు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం శ్రీరామ్ నగర్ కాలనీలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం నూతన ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామనవమి సందర్భంగా నూతన ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించామని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నాయకులు జన్నారపు విజయలక్ష్మి శంకర్ , నాయిని సంతోష్ , ఆలయ కమిటీ అధ్యక్షులు అల్లాడి వెంకటేశ్వర్లు , సతీష్ రావు దేష్ పాండే , మాజీ సర్పంచ్ ఆకుల శ్రీనివాస్ , ఎస్సై లింబాద్రి , లండేరి కిషన్ , అయిందల జనార్ధన్ , కాలనీవాసులు ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.