Faizullah Khan: బీఆర్ఎస్ కు ఓటు వేస్తే ఆ ఓటు వృధా

సిరాన్యూస్‌, బేల‌
బీఆర్ఎస్ కు ఓటు వేస్తే ఆ ఓటు వృధా
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్
* చప్రాల గ్రామం లో కాంగ్రెస్ ప్రచారం…

ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని చప్రాల గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ ఆధ్వ‌ర్యంలో ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క తరపున గడపగడపకు వెళ్లి ప్రచారం నిర్వ‌హించారు. సందర్భంగా మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ఆదివాసి మహిళకు అవకాశం వచ్చిందన్నారు. గత పది సంవత్సరాలలో కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం దళిత గిరిజన మైనార్టీ బహుజన వ్యతిరేక పార్టీ అని మత ద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలను మతాల పేరిట విడదీసిందన్నారు. దళిత గిరిజన మైనారిటీ బహుజనులకు న్యాయం జరగాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. బీఆర్ఎస్ పార్టీ చెల్లని రూపాయి అని ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని అన్నారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే ఆ ఓటు వృధా అవుతుందని అన్నారు. మే 13 వ తారీకున జరిగే ఎన్నికల్లో అదిలాబాద్ పార్లమెంటు అభ్యర్థి ఆత్రం సుగుణక్కకు అమూల్యమైన ఓటు వేసి చప్రాల నుండి అత్యధిక మెజార్టీ తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విలాస్ పటేల్ మాజీ ఎంపిటిసి గోపాల్ శంకర్ హేమంత్ పటేల్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *