సిరాన్యూస్, ఆదిలాబాద్
శ్రీరామనవమి మన అందరికీ ప్రత్యేకం: ఎమ్మెల్యే పాయల్ శంకర్
శ్రీరామనవమి మన అందరికీ ప్రత్యేకమైనదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శ్రీరామనవమి ఉత్సవాన్ని గ్రామ గ్రామాన వాడ వాడన ఆనందోత్సాహాల మధ్యలో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గ్రామాల్లో పట్టణంలోని ఆలయా లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామనవమి మనం ఎన్నో ఏళ్లుగా జరుపుకుంటున్నాం కానీ ఈ సంవత్సరం శ్రీరామనవమికి ఒక ప్రత్యేకత ఉంది. 500 ఏళ్ల నాటి హిందువుల కలను సాకారం చేసుకొని ఈ సంవత్సరం మనం పండగ జరుపుకుంటున్నాం అని అన్నారు. దీనికి కారణమైన నరేంద్ర మోడీ గారికి యావత్ భారత దేశమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు రుణపడి ఉన్నాడు అని ఆయన అన్నారు. ఆలయాల్లో నిర్వహిస్తున్న కళ్యాణ ఉత్సవాల్లో పాల్గొన్న పాయల్ శంకర్కు నిర్వాహకులు శాలువాతో సన్మానించారు. ఆలయాలను సందర్శించిన వారిలో జిల్లా నాయకులు కార్యకర్తలు ఉన్నారు.