సిరాన్యూస్, సైదాపూర్
బీటీ రోడ్డు పనులను ప్రారంభం : గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీస బీరయ్య
సైదాపూర్ మండలం సోమారం గ్రామం ఎల్లమ్మతల్లి దేవాలయం నుండి గర్రెపల్లి గ్రామంతో పాటుగా సైదాపూర్ మండల రోడ్డు వరకు బీటీ రోడ్డు పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. సోమారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీస బీరయ్య కొబ్బరికాయ కొట్టి బీటీ రోడ్డు పనులు ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో 2.8 కోట్లు రూపాయలు మంజూరు అయ్యాయి, ఇంతా త్వరగా పనులు ప్రారంభించడం పట్ల గ్రామ ప్రజలు మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారన్నారు. కార్యక్రమంలో కౌడగాని కిషన్,వేముల కొమురయ్య, కౌడగాని రాజేశ్వర్ రావు,మొకిడి కిషన్, కౌడగాని దేవరాజ్,దొకిడి తిరుపతి,అమరగొండ గట్టయ్య, బెల్లి వీరస్వామి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.