Jogu Ramanna: ప్రజలంతా ఆయురారోగ్యాలతో జీవించాలి: మాజీ మంత్రి జోగు రామన్న

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
ప్రజలంతా ఆయురారోగ్యాలతో జీవించాలి: మాజీ మంత్రి జోగు రామన్న

అందరికీ సమన్యాయం చేయగల ఒకే ఒక వ్యక్తి శ్రీరాముడు, ఆయన అడుగుజాడల్లో ప్రజాసేవలో పాల్గొంటున్నామని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని రణదీవ్య నగర్, కొలిపుర, రాంనగర్, తో పాటు మరిన్ని కాలవనీలలో వివిధ ఆలయాల్లో జరిగిన కళ్యాణ వేడుకల్లో మాజీ మంత్రి జోగురామన్న పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. .పట్టణంలోని వివిధ ఆలయాలలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలలో ఆయన పాల్గొన్నారు. నిర్వాహకులు ఆయనకు సాదరంగా స్వాగతం పలకగా. శాలువాతో ఘనంగా సత్కరించారు.స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. ఈమేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ.. శ్రీ రాముని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు. ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ అనాదిగా వస్తున్న వేడుకలను ఘనంగా జరుపుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో ఆధ్యాత్మికతకు తొలి ప్రాధాన్యం కల్పిస్తూ ఆలయాల నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇజ్జగిరి నారాయణ, మహేందర్ , కౌన్సిలర్ కొండ గణేష్‌, శ్రీనివాస్. ధర్మపాల్.భూమన్న.సతీష్.తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *