సిరాన్యూస్, బేల
ఉపాధి హామీ పనుల్లో అధికారులు పర్యవేక్షణ ఏది.!
* పొలలో అసౌకర్యంగా సాగుతున్న పనులు…
* కూలీ డబ్బులు అందక ఇబ్బందులు
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో ఉపాధి హామీ పథకం గాడి తప్పుతోంది. అధికారులు కాగితాల్లో లెక్కలు తప్ప .. కూలీల వెతలు పట్టించుకోవడం లేదు. కనీసం కూలీలకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పని ప్రాంతంలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు గాను టెంటు, తాగేందుకు నీటి వసతి, గాయాలైతే ఫస్ ఎయిడ్ లు ఇవేవి అందుబాటులో లేక కూలీలు ఇబ్బంది పడుతున్నారు. ఎర్రటి ఎండలో పని చేసిన కూలీలు కొదిసేపైనా సేద తీరడానికి టెంటు వేయాల్సి ఉంది. కానీ ఎక్కడ టెంట్లు వేయకపోవడంతో కూలీలకు స్థానికంగా నిల్వ నీడ కరువవుతోంది. బేల మండల కేంద్రం లో ఉపాధి హామీ పనులకి కూలీలు రోజు ఉదయం ఆరు గంటల నుండి ఎండ అయ్యె వరకు పనులకి పరిమితం అవుతున్నారు.ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు రోజుకు 300 రూపాయలు కూలి నిర్ణయించినందున కూలీలు జోరుగా పని సాగిస్తున్నారు. చప్రాల గ్రామం లో నెల అవుతున్న కూలీలు డబ్బుల కోసం ఎదురు చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బేలా, కాప్సీ, అవల్పుర్ , దహెగావ్ పలు గ్రామాల్లో పనులు మొదలై మూడు వారాలు గడుస్తున్న నిరుపేద కూలీలు, వ్యవసాయ కార్మికులు నిరాశకు గురి అవుతున్నామని అంటున్నారు. ఈ వేసవి కాలంలో ఇలాంటి పనులు లేక ఈ ఉపాధి హామీ పని ఆసరా గా ఉన్నపటికీ కూలి డబ్బులు ఆలస్యం ఎందుకు అని అంటున్నారు.. ఉపాధి హామీ పని చేయుటకు తమ కూలీలకు తట్టగుళ్ల, గడ్డపార వంటి వస్తువులు అందుబాటులో ఇవ్వాలని కోరుతున్నారు. పనిచేసే ప్రదేశంలో కనీస త్రాగునీటి వసతి, మరియు పని నిర్వహణలో గాయాలు తగిలిన చికిత్స కోసం ఎటువంటి సౌకర్యాలు అందుబాటులో లేనందున. గాయాలయితే ప్రధమ చికిత్స కిట్లు అందుబాటులో లేకపోవడం వల్ల నీటితో శుభ్రం చేయాల్సి వస్తుందంటున్నారు.. అధికారులు ఈ విషయాలను గమనించి తమ కూలి డబ్బులు ఆలస్యం చేయకుండా కనీస వస్తువులు ఉపాధి హామీ సామగ్రి తమకు అందించాలని వేడుకుంటున్నారు.