సిరా న్యూస్, ఓదెల:
అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం
పెద్దపెల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి పురస్కరించుకొని సీతరాముల కళ్యాణం వేదమంత్రాలతో మంగళ వాయిద్యాలతో నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తుల ఈ కార్యక్రమానికి హాజరైనారు. సీతారాముల కళ్యాణం శ్రీనివాసాచార్యులు,నరసింహ చార్యులు కళ్యాణం జరిపించినారు. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ సిబ్బంది మంచినీటి సౌకర్యం చలువ పందిళ్ళు, కూలర్లు ఏర్పాటు చేసినారు ఆలయ నిర్వాహకులు. వివాహ అనంతరం గోపతి మల్లయ్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు. కార్యక్రమంలో ఆలయ ఈవో సదయ్య, ఆలయ ప్రధాన అర్చకులు ధూపం వీరభద్రయ్య, ఓదెల ఎంపిటిసి బోడకుంట లక్ష్మీ చిన్నస్వామి, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, మాజీ ఎంపీపీ బుద్దే రామస్వామి, ఆలయ చైర్మన్ మేకల మల్లేశం, ధర్మకర్తలు రాపర్తి మల్లేశం మేడగొని శ్రీకాంత్,డాక్టర్ కనికి రెడ్డి సతీష్,అరేల్లి మొండయ్య కర్రె కుమార్ స్వామి, బత్తుల రమేష్ బాబు, రౌతు స్వర్ణలత, పరిపాటి నరేందర్ రెడ్డి, పలకల నరసింహారెడ్డి, డాక్టర్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు, ఆలయ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.