కాకర్లపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పెన్నులు పంపిణీ

సిరా న్యూస్,మంథని;

మంథని మండలం కాకర్లపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గ్రామ వాస్తవ్యులు మెండే రాజేశ్వరి – రాజయ్య లు గురువారం విద్యార్థులకు పెన్ను లు అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు వేసవి కాలంలో ఫైనల్ పరీక్షలు ప్రారంభం అవుతున్నందున ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పెన్ను లు పంపిణీ చేయడం జరిగిందన్నారు.అదే విధంగా ముందు ముందు గ్రామంలో మరిన్ని మంచి సేవ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.విద్యార్థులు చదువుతో పాటు ఆటలలో ముందు ఉండి తల్లిదండ్రులకు,ఊరుకు మంచి పేరు తీసుకరావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కోట లక్ష్మణ్, సహోపాధ్యాయుడు ఎల్ రమేష్,గ్రామస్తులు ఎనగందుల శేఖర్,తదితరులు ఉన్నారు.
=====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *