సిరాన్యూస్, ఓదెల
కామ్రేడ్ తాళ్లపల్లి పోషయ్యకు ఘనంగా నివాళులు
ఓదెల మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన తాళ్లపల్లి పోచయ్య తెలంగాణ రైతన్న సాయుధ పోరాటంలో గట్టేపల్లి మురళితో కలిసి పోరాటం కొనసాగించారు .అదే స్ఫూర్తితో కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీల సభ్యునిగా కొనసాగుతూ తుది శ్వాస వరకు అదే పార్టీలో ఉంటూ తన సేవలు అందించారు. అలాగే తన కుమారులైన నలుగురు కుమారుల తన తండ్రి బాటలోనే నడుస్తూ కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీల సభ్యులుగా కొనసాగుతున్నారు .రెండవ కుమారుడైన తాళ్లపల్లి మల్లయ్య పెద్దపెల్లి జిల్లా కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్నారు అలాగే తన మూడవ కుమారుడైన తాళ్లపల్లి లక్ష్మణ్ దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నారు . తన మనవడు తాళ్లపల్లి సురేందర్ ఏవైఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులుగా కొనసాగుతూ వస్తున్నారు. ఈ విధంగా తను ఎత్తిన జెండాను దించకుండా తన కుమారులు వాళ్ళకు కల్గినటువంటి సంతానం కుటుంబ సభ్యులందరూ కలిసి అదే బాటలో అదే జెండా కింద ఒకే గొడుగు కింద ఒకే పార్టీ పైన ఏకతాటిపై నడుచుకుంటూ తాళ్లపల్లి పోచయ్య ఆశయాలను కొనసాగిస్తూ వచ్చారు .నేటికీ కామ్రేడ్ తాళ్లపల్లి పోచయ్య తుది శ్వాస విడిచి ఏడు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా తన కుటుంబ సభ్యులందరూ వారి కి ఘనమైన నివాళులు అర్పించారు.