సిరా న్యూస్,హన్మకొండ;
పడేండ్లుగా గత ప్రభుత్వం, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గుడిసె వాసులకు డబల్ బెడ్ రూములు ఇస్తానని మభ్యపెట్టారని ఆరోపిస్తూ స్థానిక గుడిసె వాసులు ఆరోపించారు. అంబేద్కర్, జితేందర్ సింగ్ నగర్ లో పదేండ్ల క్రితం నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి పోవడానికి స్థానిక గుడిసె వాసులు ప్రయత్నించారు. వారిని సుబేదారి పోలీసులు అడ్డుకున్నారు. ప్రెస్ క్లబ్ సమీపంలో రోడ్డు పై బైటయించిన నిరసనకారులు కలెక్టర్ హామీ ఇస్తేనే విరమిస్తామని భీష్మించుకుని కూర్చున్నారు.