Goush alam: పకడ్బందీగా చెక్ పోస్ట్‌ నిర్వహణ : ఎస్పీ గౌష్ ఆలం 

సిరాన్యూస్‌,ఆదిలాబాద్‌
పకడ్బందీగా చెక్ పోస్ట్‌ నిర్వహణ : ఎస్పీ గౌష్ ఆలం 
* మూడు చెక్ పోస్టుల‌ను త‌నిఖీ
* మద్యం, డబ్బు, గంజాయి రవాణాకు అడ్డుకట్ట

పకడ్బందీగా చెక్ పోస్ట్‌ నిర్వహణ కొన‌సాగుతుంద‌ని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అన్నారు.మహారాష్ట్రలో శుక్ర‌వారం ఎన్నికల సందర్భంగా జిల్లా ఎస్పీ గౌష్ ఆలం మహారాష్ట్రతో సరిహద్దుతో ఉన్న మూడు అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది విధులను పరిశీలించారు. మొదటగా జైనథ్ మండలం పిప్పర్ వాడ చెక్పోస్ట్ ను చేరుకొని అక్కడ నుండి ఆదిలాబాద్ కు వస్తున్న వాహనాలను , ఆదిలాబాద్ నుండి మహారాష్ట్రకు వెళ్లే వాహనాలను పరిశీలించారు. ప్రజలెవరు 50వేల కన్నా ఎక్కువ నగదును తీసుకొని వస్తే దానికి సంబంధిత రసీదులను కలిగి ఉండాలని సూచించారు. స్వాధీనం చేసుకున్న నగదు డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఉంటుందని, సంబంధిత పత్రాలను చూపించి డబ్బును విడిపించుకోగలరని సూచించారు. అదేవిధంగా మహారాష్ట్ర తో అనుసంధానం చేసే ఆనందపూర్ చెక్ పోస్ట్ ను పరిశీలించారు. యువత మాల్ జిల్లాతో సరిహద్దును పంచుకుని దిగ్రస్ చెక్‌పోస్టు ను కూడా పరిశీలించారు. వాహనాల రాకపోకలను గమనించి సిబ్బందికి సూచనలు చేయడం జరిగింది. తదుపరి చంద్రపూర్ జిల్లాతో సరిహద్దుతో ఉన్న శంకర్ గూడా చెక్పోస్ట్ ను అవతల వైపు ఉన్న పరసోడా చెక్ పోస్ట్ ను కూడా పరిశీలించారు. జైనథ్ మండలంలో సిఆర్పిఎఫ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి వారికి రానున్న ఎన్నికల సందర్భంగా నిర్వహించవలసిన విధులపై సూచనలు చేయడం జరిగింది. ఇప్పటివరకు జిల్లాలో రూ 34,48,060/- సరైన పత్రాలు లేనటువంటి నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది తెలిపారు. కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ వి శ్రీకాంత్, డిప్యూటీ కమాండెంట్ స్వప్నిల్ పవర్, జైనథ్ ఎస్సై వి పురుషోత్తం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *