సిరా న్యూస్,విశాఖపట్నం;
పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ భారీ ర్యాలీ నిర్వహించారు. నూకాలమ్మవారికి పూజలు చేసి ర్యాలీగా నామినేషన్ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి బయలుదేరారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిగా ఆడారి ఆనంద్ కుమార్ నామినేషన్ జరుగుతుంది. నియోజకవర్గంలో అత్యంత ప్రసిద్ధి చెందిన నూకాలమ్మ వారి ఆశీస్సులు తీసుకోవడం ఎంతో శుభకరం. ఆడారి ఆనంద్ కుమార్ మంచి మెజార్టీతో గెలవాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసామన్నారు. విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఓటమి భయంతోనే గుడికి తాళాలేశారని సుబ్బారెడ్డి మండిపడ్డారు.
=======================