Goush alam: చెక్ పోస్టులను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ గౌష్ ఆలం

సిరాన్యూస్‌, బేల‌
చెక్ పోస్టులను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ గౌష్ ఆలం

తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా సరిహద్దు రాష్ట్రం అయినా మహారాష్ట్ర నుండి మద్యం, నగదు, ఇతర నిషేధిత పదార్థాలు, వస్తువులు ఆదిలాబాద్ జిల్లాలోనికి రాకుండా చూసేందుకు బేల పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకర్ గూడ వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.ఈ చెక్ పోస్టును శుక్ర‌వారం జిల్లా ఎస్పీ గౌష్ ఆలం త‌నిఖీ చేశారు. ఈసంద‌ర్భంగా ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 24/7 అన్ని వాహనాలను పూర్తిగా, క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు. శుక్రవారం రెండు చెక్ పోస్టులను తనిఖీ చేసి ఇక్కడ ఉన్న అధికారులకు తగు సూచనలు, సలహాలు చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 40నుండి 50 లక్షల రూపాయలు సీజ్ చేయడం జరిగింది త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా మహారాష్ట్ర రాష్ట్రం నుండి నాటుసారా, గంజాయి ,మాదకద్రవ్యాలు, అక్రమ రవాణాపై ప్రత్యేఖ నిఘాపెట్టి అన్ని రకాల వాహనాలను తనిఖీ చేయాలని తెలిపారు. చెక్ పోస్టు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు.అనుమానం ఉన్న, ముందస్తు సమాచారం ఉన్నా తక్షణమే ఉన్నతాధికారులుకు సమాచారం అందించాలని తెలియజేసారు. చెక్ పోస్టులో మరింత నిఘా పెంచాలని ఆదేశించారు. ఎస్పీ వెంట డిప్యూటీ కమండెంట్ శ్రీకాంత్, అసిస్టెంట్ కమండెంట్ స్వప్నిల్ పవార్, జైన‌థ్‌ సి.ఐ సాయినాథ్ , సివిల్ ఆఫీసర్ సలా ఉద్దీన్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *