సిరా న్యూస్,ఖానాపూర్ టౌన్
జనని ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.5000 ఆర్థిక సాయం అందచేత
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ కాలనీకి చెందిన లండ్రి శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. నిరుపేద కుటుంబమైన లండ్రి శ్రీనివాస్ కుటుంబానికి శనివారం జనని ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి, నెలసరి సరుకులు కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో జనని ఫౌండేషన్ సభ్యులు, తోట సుమిత్, కొక్కుల ప్రదీప్ ,చింతపండు రవి, అడ్వకేట్లు వెంకట్ మహేందర్, మట్టరి రాజశేఖర్, నాగేందర్, అడిదేలా మహేందర్ తదితరులు పాల్గొన్నారు.