Sprinkler:స్ప్రీంక‌ర్లు పైపులకు నిప్పు పెట్టిన వ్యక్తులు

సిరా న్యూస్, కుందుర్పి
స్ప్రీంక‌ర్లు పైపులకు నిప్పు పెట్టిన వ్యక్తులు
* సుమారు 12,500లు ఆర్థిక నష్టం

మండల పరిధిలోని కరిగానపల్లి గ్రామానికి చెందిన రైతు  బొమ్మలింగప్ప వ్యవసాయ క్షేత్రంలో తన ఐదు ఎకరాల పొలంలో దాదాపు 50 స్పింక్లర్ పైపులను గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటన శ‌నివారం ఉదయం 10.30కు చోటుచేసుకొని ఉంది. ఈఘటన ఏ సమయంలో జరిగిందో తనకు తెలియదని బాధితుడు తెలిపారు. తాను పొలంలోకి వెళ్లగా స్వింకలరులు పైపులకు నిప్పు పెట్టిన ఘటనను తిలకించనన్నారు. ఉద్దేశపూర్వకంగా వ్యక్తులు అగ్గి పెట్టి ధ్వంసం చేశారని బాధిత రైతు బొమ్మలింగప్ప విలేకరులతో తెలియజేశారు. ఈ ఘటన సుమారు రూ,పదివేలు నుంచి రూ,12,500లు దాకా ఆర్థిక నష్టం జరిగిందని వివరించారు. స్ప్రీంక‌ర్ పైపులకు ఉద్దేశపూర్వకంగా వ్యక్తులు నిప్పు పెట్టి ఉంటే వారిపై కఠిన చరలు తీసుకోవాలని పోలీసులను ఆ రైతు కోరారు. ఏదిఎమైనా వ్యక్తులు స్ప్రీంక‌ర్లు నింపు పెట్టారా, లేదా ఎక్కడ నుంచి అకతాయి వెధవలు అగ్గిపుల్ల రాసి వేసి ఉంటే ఘటన చోటు చేసుకుందా పోలీస్ అధికారుల దర్యాప్తులో తేలాల్సింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *