Jogu Ramanna: ఇంద్ర‌వెల్లి అమ‌ర‌వీరుల స్తూపానికి నివాళుల‌ర్పించిన మాజీ మంత్రి జోగు రామన్న

సిరా న్యూస్,ఇంద్ర‌వెల్లి
ఇంద్ర‌వెల్లి అమ‌ర‌వీరుల స్తూపానికి నివాళుల‌ర్పించిన మాజీ మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్ జిల్లా ఇంద్ర‌వెల్లి ఆదివాసీ అమరవీరులకు బీఆర్ ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ ఎస్‌ పార్టీ ఇంచార్జీ భూక్యా జాన్సన్ నాయక్ నివాళుల‌ర్పించారు. ఇంద్రవెళ్లి మండల కేంద్రంలో గల ఆదివాసీ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న, ఖానాపూర్ ఇంచార్జి జాన్సన్ నాయక్ , బోథ్ శాసన సభ్యులు అనిల్ జాద‌వ్‌ల‌తో తో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1981 ఏప్రిల్ 20 మరువలేని రోజని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమాయక ఆదివాసీ బిడ్డన్ని పిట్టల కాల్చిచంపిన ఘనత నేటి కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని అన్నారు. అలాంటి చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు స్థూపం వద్ద నివాళులర్పించి క్షమాపణలు చెప్పడం ఏమాత్రం సమంజసం అని అన్నారు. అదేవిధంగా నాడు ఆగష్టు 2023 లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇదే ఇంద్రవెల్లికీ వచ్చి అమరుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇస్తాను అని మర్చిపోయారు. ఆదివాసుల మీద ఏ మాత్రం ప్రేమ లేనిది ఈ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 55 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఆదివాసీ ఆరాధ్య దైవం కొమరంభీం స్మృతి వనం జోడెన్ గాట్ కు కనీస రోడ్డు సౌకర్యం కూడా కల్పించలేకపోయిందని అన్నారు. అదే కేసిఆర్ 10 ఏళ్ల పాలనలో కొమరం భీం స్మృతివనంకి 7 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మించి కొమరం భీం జ్ఞాపకార్థం కొమరం భీం మ్యూజియం నిర్మించిన నాయకుడు కేసిఆర్. ఏదైతే కొమరం భీం నినాదం జన్ జంగల్ జమీన్ ఉండేనో దానికి అనుగుణంగా గిరిజన ప్రజలకు పొడు పట్టాలు ఇచ్చి,గిరి వికాస్ పథకం క్రింద వారి భూములలో బోరు కరెంటు సౌకర్యం కల్పించిన ఘనత కెసీఆర్ దేన‌ని అన్నారు. అదేవిధంగా మావా నాటే మావా రాజ్ లో భాగంగా తండాలను,గుడాలను గ్రామ పంచాయితీలుగా తీర్చిదిద్ది గిరిజనులకు 6శాతం నుండి 10శాతం గిరిజనులకు రిజర్వేషన్లు పెంచిన నాయకుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *