సిరాన్యూస్, ఉట్నూర్
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో పలువురు కాంగ్రెస్ చేరిక
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో కడెం మండలంలోని లింగపూర్ మాజీ సర్పంచ్ – బిజెపి ఓబీసీ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేష్ తో పాటు మాజీ సర్పంచ్ గొల్ల రాజన్న, మాజీ ఉప సర్పంచ్ రాజారెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు గంగమల్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికీ కండువా కప్పి పార్టీలో సాదరంగా ఆహ్వానించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కడం మండల అధ్యక్షుడు తుమ్మల మల్లేష్, సీనియర్ నాయకుడు పడిగెల భూషన్ ,తదితరులు పాల్గొన్నారు.