– బుట్టా ప్రతుల్
సిరా న్యూస్,నందవరం;
మండలంలోని ధర్మపురం గ్రామం నందు ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తనయుడు బుట్టా ప్రతుల్ పిలుపునిచ్చారు.ఇంటింటి ప్రచారం చేశారు.ఈ సందర్భంగా బుట్టా ప్రతుల్ మాట్లాడుతూ..ప్రజల మేలుకోరే వైఎస్సార్సీపీకి అండగా నిలిచి మరోసారి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసు కుందామని మే 13న జరగనున్న ఎన్నికల్లో రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో పేదల బతుకులు మారాయన్నారు.పేదలందరి సంక్షేమం కోసం నవరత్నాల పథకాలు అమలు చేశామన్నారు.రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉంటేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని తెలిపారు. పొరపాటున టీడీపీ వస్తే మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయని.ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు అబద్ధాల కోరు అని విమర్శించారు14 ఏళ్ల టీడీపీ పాలనకు ఈ ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనకు తేడాను గమనించాలని కోరారు.2014 ఎన్నికల్లో పొదుపు సంఘాల మహిళలు,రైతులకు,రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేశారన్నారు.రుణాలు మాఫీ కాకపోవడంతో అధిక సంఖ్యలో మహిళా సంఘాలు డీఫాల్టర్ల జాబితాలోకి వెళ్లాయన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతపక్ష నేతగా ఉన్న సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పొదుపు సంఘాల రుణాలను నాలుగు దశల్లో మాఫీ చేశారన్నారు.మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు నవరత్నాల్లో భాగస్వాములను చేశారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శివారెడ్డి గౌడ్ ,మండల సీనియర్ నాయకులు రామకోటేశ్వర్ రెడ్డి ,నియోజకవర్గం బిసి సెల్ నాయకులు విరుపాక్షిరెడ్డి , మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి ,జేసియస్ మండల కన్వీనర్ చాంద్ భాషా,ధర్మపురం నాయకులు రాఘవరెడ్డి ,సుధాకర్,నరసన్న , రంగస్వామి,హాలహర్వి గ్రామ నాయకులు హజరత్ ,ప్రతాప్ ,కాశీం ,జయన్న , వెంకటేష్ ,రామలింగ స్వామి ,లక్ష్మరి సీను,రాజు , గుర్రాల వెంకటేశ్ ,శాంతి రాజ్ ,దావీదు ,జయరాజు , హనూక్ ,దస్తగిరి ,దేవపాలు,ఇషాక్ , జగ్గపురం నాయకులు కోతి ఈరన్న ,నరసరాజు, బాపురం నాయకులు యల్లా రెడ్డి ,చిన్న రాముడు ,నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.