సిరా న్యూస్,హైదరాబాద్;
సీఎం అభ్యర్థిని ఎంపిక చేసేకుందుకు గాను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ శాసనసభా పక్ష సీఎల్పీ సమావేశం ముగిసింది. పార్టీ పరిశీలకులు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, జార్జ్, దీపా దాస్ మున్షి, అజయ్, మురళీధరన్, ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే తదితరులు హజరయ్యారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను హైకమాండ్ కే అప్పగిస్తూ టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి సమావేశంలో ఏక వాక్య తీర్మానం చేశారు. తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, మల్లు భట్టి విక్రమార్క, కొండా సురేఖ, ప్రేమ్ సాగర్, శ్రీధర్ బాబు తదితరులు తీర్మానాన్ని బలపరిచారు. ఈ తీర్మానాన్ని ఏఐసీసీ పరిశీలకులైన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పార్టీ రాష్ట్ర చీఫ్ మాణిక్ రావ్ ఠాక్రే తదితరులు హైకమాండ్ కు పంపారు. సీఎల్పీ నేత ఎంపికను పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు అప్పజెప్పారు.