టీడీపీ ప్రభంజనం ఖాయం

సిరా న్యూస్,చంద్రగిరి;
రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో టీడీపీ ప్రభంజనం రోజురోజుకు పెరిగిపోతోందని, ఈ ప్రభజనంలో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని టీడీపీ చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాద్ రావు, టీడీపీ చిత్తూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సీఆర్ రాజన్ లు జోస్యం చెప్పారు. శనివారం తిరుచానూరు పంచాయతీలోని రంగనాథం వీధి, వేపమాను వీధి, రేణిగుంట రోడ్డు ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులతో కలిసి వారు పెద్ద ఎత్తున ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ పల్లెకు వెళ్లినా ప్రజలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఐదేళ్ల వైసిపి రాక్షస పాలనను తరిమికొట్టేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నట్లు సంసిద్దంగా ఉన్నారని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళు ఓటుకు 10వేలు ఇచ్చిన ప్రజా మద్దతు తమకే ఉందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం వారిని టీడీపీ నాయకులు భారీ గజమాల, దుశ్శాలువా లతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి, కిషోర్ రెడ్డి, మునిరత్నం రెడ్డి, హరిరాం రెడ్డి, దామినేడు రమేష్, సాల్మన్రాజు, కలీమ్, మోహన్ రెడ్డి, రమణ రాయల్, జనసేన వెంకట్ రాయల్, బీజేపీ శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *