సిరాన్యూస్, ఉట్నూర్
ప్లాస్టిక్ వాడకాన్ని సంపూర్ణంగా నిషేధించాలి
* యాక్షన్ ఎయిడ్ హెచ్ ఆర్ డీ మర్సుకోల తిరుపతి
* ఘనంగా ప్రపంచం దరిత్రి దినోత్సవం
ప్లాస్టిక్ వాడకాన్ని సంపూర్ణంగా నిషేధించ డానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని యాక్షన్ ఎయిడ్ హెచ్ ఆర్ డీ మర్సుకోల తిరుపతి
అన్నారు. అదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంధర్మాజీ పెట్ గ్రామంలో యాక్షన్ ఎయిడ్ ఆధ్వర్యంలో ప్రపంచ దరిత్రీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా యాక్షన్ ఎయిడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దినోత్సవము లో ధర్మాజిపేట్ గ్రామంలో ముందుగా ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు అవగాహనా కల్పించారు. ఈ సందర్భంగా యాక్షన్ ఎయిడ్ హెచ్ ఆర్ డి మర్సుకొల తిరుపతి మాట్లాడుతూ మానవళి తప్పిదం వల్ల వాతావరణంలో మార్పులు సంభవించి భూమిపై అనేకమైన ఉత్పాతాలు జరుగుతున్నాయని అన్నారు వీటన్నిటికీ కారణం మానవ తప్పిదాలు అని తెలియజేశారు. ప్రధానంగా ప్లాస్టిక్ వాడకం అడవులు అంతరించిపోవడం జరుగుతుందని అన్నారు. అడవులను కాపాడి వాతావరణ పరిస్థితులను కాపాడాల్సిన బాధ్యత మానవాళికి ఉందనన్నారు . కార్యక్రమం లో గ్రామ పటేల్ భీంరావ్, కన్ను రాజు, లక్ష్మణ్, ధర్మ తదితరులు ఉన్నారు.