Payal Shankar: ప్రతి రంగంలో మహిళా శక్తి భాగస్వామ్యం: ఎమ్మెల్యే పాయల్ శంకర్

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
ప్రతి రంగంలో మహిళా శక్తి భాగస్వామ్యం: ఎమ్మెల్యే పాయల్ శంకర్
* బీజేపీ మహిళా శక్తి సమ్మేళనం

దేశంలో గత 10 సంవత్సరాలుగా నారి శక్తికి ప్రాధాన్యతనిస్తూ ప్రతి రంగంలో,దేశ అభ్యున్నతిలో మహిళలను భాగస్వామ్యం చేస్తూ పరిపాలనను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం నరేంద్రమోదీ అని, నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వమని బీజేపీ పార్లమెంట్ ఇన్‌చార్జ్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు .ఆదిలాబాద్ పట్టణంలో సోమ‌వారం అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ మహిళా శక్తి సమ్మేళనం కార్యక్రమం నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పార్టీలోని మహిళా విభాగం కృషి చేసి పార్లమెంట్ అభ్యర్థి గోడం నగేష్ ని గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధ్యక్షులు, జిల్లా, మండల బీజేపీ మహిళా కార్యవర్గ బాధ్యులు, మహిళా,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *