సిరాన్యూస్, భీమదేవరపల్లి
శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
భీమదేవరపల్లి మండలంలోని మల్లారం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో సీసీ రోడ్డు, చుట్టుపరారి నిర్మాణం సోమవారం ఉదయం ప్రారంభించారు. ఆలయ ఆవరణలో సీసీ రోడ్డు ఏర్పాటుకు క్రీ శే గూడెల్లి వెంకట్ రెడ్డి జ్ఞాపకార్థం కుమారుడు గూడెల్లి తిరుపతి రెడ్డి సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా గౌడ సంఘం అధ్యక్షులు చింత రాజు మాట్లాడుతూ వచ్చే మే నెల 11 వ తేదీ నుండి 15వ తేదీ వరకు 4 రోజుల ఎల్లమ్మతల్లి పెద్ద పండుగ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. 11వ తేదీన మల్లారం గ్రామ పొలిమేర అష్ట దిగ్బంధనం, 12వ తేదీన ఎల్లమ్మ తల్లి ఆలయంలో దోర్నాపక, పోచమ్మతల్లి బోనం సమర్పణ, లంద మరియు జోగు ఎత్తుట, 13వ తేదీన జాలాభిషేకం కార్యక్రమం, 14వ తేదీన ఉదయం 7 గంటలకు పుట్ట ధ్వని కార్యక్రమం, సాయంత్రం సమయాన అమ్మవారికి రెండు బోనాల సమర్పణ కార్యక్రమం, 15 వ తేదీన అమ్మవారి దర్శనం అనంతరం బంధువులతో విందు కార్యక్రమంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు అధ్యక్షులు చింతరాజు, రంగు రాజయ్య, నోముల సమ్మయ్య, కోతి యాదగిరి, నోముల సందీప్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు