సిరాన్యూస్, కరీంనగర్
ప్రజల మోసగించి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ
* బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ చల్లూరి రాజు
అమలుకు నోచుకోలేని గత హామీలు, ప్రజల మోసగించి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ చల్లూరి రాజు అన్నారు. సోమవారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడారు. శాసనసభ సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమలు చేస్తామని చెప్పి ప్రజల మోసగించి అధికారం చేజిక్కించుకున్నారని అన్నారు. కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. రైతులకు క్వింటాలకు 500రూ. బోనస్ చెల్లిస్తామని చెప్పి రైతులను మోసం చేశారని. వారికి ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఇస్తామన్న 500రూపాయల బోనస్ తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అదే విదంగా రైతులకు 2లక్షల రుణమాఫీ చేయాలని, గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ మేనిఫెస్టో లో సూచించిన విధంగా ప్రతి కుటుంబానికి ఆరుగ్యారంటీల హామీలు అమలు చేసి ఓట్లు అడగాలి అన్నారు.ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.