Rajender Rao: రాజేందర్ రావు నామినేషన్‌కు బ‌య‌లుదేరిన నాయ‌కులు

సిరాన్యూస్‌, సైదాపూర్
రాజేందర్ రావు నామినేషన్‌కు బ‌య‌లుదేరిన నాయ‌కులు

కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు నామినేషన్ సందర్భంగా సైదాపూర్ మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయ‌కులు త‌ర‌లివెళ్లారు. ఈసంద‌ర్భంగా ఎక్లాస్పూర్ గ్రామశాఖ అధ్యక్షులు అంబాల ప్రేమ్ కుమార్ మాట్లాడారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించబోతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు రవీందర్, సంపత్, క్రాంతి కుమార్, దస్తగిరి, రమేష్, తిరుపతి ఆర్ఎంపి కిష్టయ్య, రాజు, శ్రీనివాస్, క్రాంతికుమార్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *