Jogu Ramanna: ఆధ్యాత్మిక చింతనతో ప్ర‌శాంత‌త‌

సిరాన్యూస్‌,బేల‌
ఆధ్యాత్మిక చింతనతో ప్ర‌శాంత‌త‌
* మాజీ మంత్రి జోగు రామన్న
* బోరిగవ్ గ్రామంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన

ఆధ్యాత్మిక చింతనతో ప్ర‌శాంత‌త ఉంటుంద‌ని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మసాలా కె గ్రామ పంచాయతీలోని బోరిగవ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కు సోమవారం మాజీ మంత్రి జోగు రామన్న ముఖ్యఅతిథిగా హాజరయ్యరు.అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఏర్పాటుచేసిన సమావేశంలో జోగు రామన్న మాట్లాడుతూ తన సొంత డబ్బులు రు.9 లక్షలు వేచ్చించి గ్రామంలో హనుమాన్ ఆలయన్ని నిర్మించిన సతీష్ ప్రకాష్ పవర్( జెడ్పిటిసి బేల) వారి కుటుంబ సభ్యులందరికీ ఆంజనేయ స్వామి దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని పేర్కొన్నారు.సొంత డబ్బులు తొమ్మిది లక్షలు ఖర్చుచేసి ఆలయం కట్టించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ప్రజలందరూ భక్తి భావంతో మెలిగి ఆధ్యాత్మిక చింతనతో ముందుకు వెళితే భగవంతుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉంటాయని అన్నారు. మంచి అలవాట్లతోనే సమాజం నడుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణ,ఎంపీపీ గంభీర్ థాక్రే,అడానేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవార్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు జక్కుల మధుకర్, కోఫ్షన్ మెంబెర్ తన్వీర్ ఖాన్, ఎంపీటీసీ అరుణ్ కొడప, ప్రతాప్, మాజీ సర్పంచులు రోహిదాస్, విపిన్, చరణ్, సోసైటి చైర్మన్ జితేందర్ భేదుర్కర్, నాయకులు దేవన్న ఒల్లాప్వర్,దత్తు మెంతన్, అశోక్ ,లాల్షావ్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *