Ade Sheela: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఆడే శీలా

సిరా న్యూస్, ఆదిలాబాద్:

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఆడే శీలా

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆడే శీలా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో మాజీ జెడ్పిటిసి మస్కే మాధవ్, నాయకులు డా. కైలాష్ తదితరులతో కలిసి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కాసేపు ముచ్చటించారు. బోథ్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయనున్నట్లు ఆమె తెలిపారు. కాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా గుడిహత్నూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వారికి స్వీట్లు తినిపించారు. శాలువాలతో సన్మానించి, అభినందనలు తెలిపారు. సన్మానించిన వారిలో పార్టీ మండల అధ్యక్షులు అంకతి రవి, నాయకులు మల్యాల కరుణాకర్, ససానే మాధవ్, షేక్ ముస్తాక్, ప్రముఖ న్యాయవాది అజయ్ జొండలే, దళిత్ గాయకామ్లే, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *