సిరాన్యూస్, చిగురుమామిడి
రేపటి నుంచే వేసవి సెలవులు ప్రారంభం
* 50 రోజుల పాటు సెలవులు ప్రకటించిన విద్యాశాఖ
* జూన్ 12 వరకు పాఠశాలలకు సెలవులు
ఈనెల ఏప్రిల్ 24 నుండే చిగురుమామిడి మండలంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. మండల వ్యాప్తంగా జిల్లా పరిషత్ పాఠశాలలు 09 ప్రాథమిక పాఠశాలలు 21.ప్రాథమికోన్నత పాఠశాలలు 4. మోడల్ స్కూల్స్ 1 కస్తూరిబాయి గాంధీ పాఠశాల 1. మొత్తం 36 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 2670 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేట్ పాఠశాల 4 దాదాపు 1000 మంది ఉన్నారు. సెలవులు ప్రకటించడంతో మంగళవారం విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు. విద్యార్థులు ఆనందంతో తమ ఇళ్లకు వెళ్లారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో కమిటీ సమావేశం నిర్వహించారు. 50 రోజులపాటు వేసవి సెలవులు ప్రకటించడంతో సెలవుల్లో విద్యార్థులు ఏ విధంగా ఉండాలో పలు సూచనలు చేశారు. తీవ్ర ఎండలు మండిపోతున్న దృష్ట్యా తల్లిదండ్రులు విద్యార్థులు ఎండలో తిరగకుండా, కాలువలు బావులల్లో ఈతలకు వెళ్లకుండా చూడాలని తెలిపారు.కథల పుస్తకాలు చదవాలని,బంధుమిత్రుల ఇండ్లకి పెళ్లి వాళ్ళతో ఆప్యాయంగా గడపాలని తెలిపారు.ఏదైనా కంప్యూటర్ కి సంబంధించిన శిక్షణలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంచే విషయాలు తెలుసుకొని జాగ్రత్తలతో వేసవి సెలవులు గడపాలని తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు.ప్రభుత్వ, విద్యాశాఖ ఆదేశాల మేర కు ప్రైవేట్ పాఠశాలలు వేసవికాలంలో ఎలాంటి క్లాసులు నిర్వహించిన పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని డివోలకు ఆదేశాలు జారీ చేశారు.