సిరా న్యూస్,సికింద్రాబాద్;
హనుమాన్ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మోండా మార్కెట్ పెరుమాళ్ వెంకటేశ్వర దేవాలయం వద్ద శివాజీ నగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మోండా మార్కెట్ కార్పొరేటర్ కొంతం దీపిక హాజరయ్యారు. ఈటెల రాజేందర్ భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అనంతరం పార్టీలో చేరిన కోనేరు బావి ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలకు ఈటల రాజేందర్ కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ మల్కాజ్గిరి లో కాషాయ జెండా ఎగురవేసేందుకు ప్రతి ఒక్కరూ బూత్ స్థాయిలో కష్టపడి పని చేయాలని సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
=================