సిరా న్యూస్,చంద్రగిరి;
చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. తన నియోజకవర్గంలో యువతతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొంటూ, ఇంటింటికి వెళ్లి ప్రచారం ముమ్మరం చేశారు. ప్రచారంలో మంచి స్పందన వస్తుందని,, మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డినీ గెలిపించుకోవాలన్న ఆశతో రాష్ట్ర ప్రజలు ఉన్నారన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు,ముఖ్యమంత్రి జగన్మోహన్ అందించిన సంక్షేమ పథకాలతో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారన్నారు. టిడిపి ఎన్ని మాయమాటలు చెప్పిన చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు వైసిపి వెంట ఉన్నారనీ,అత్యధిక మెజార్టీ తో గెలుస్తామని స్పష్టం చేశారు.