సిరా న్యూస్,కుత్బుల్లాపూర్;
హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హిందు వాహిని సేన ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్ర జగద్గిరి గుట్ట సాలసర్ హనుమాన్ ఆలయం నుండి ఐడీపీల్ హనుమాన్ ఆలయం వరకు కొనసాగింది. ముఖ్యఅతిథిగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందు రామమందిరంలో హనుమంతుడికి యజ్ఞము ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున యువకులు. మహిళలు హనుమాన్ భక్తులు కాషాయ జెండాలను చేతబట్టి శుభయాత్రకు తరలి వచ్చారు. ఈ శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
====================