సిరాన్యూస్, గుడిహత్నూర్
ముత్నూర్లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం లోని ముత్నూర్ గ్రామంలో విశ్వరత్న, భరతరత్న భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మంగళవారం నిర్వహించారు. ఈ విగ్రహ ఆవిష్కరణ లో ముఖ్య అతిథి గా ముత్నూర్ గ్రామ మాజీ సర్పంచ్ గేడాం విజయకుమార్, మాజీ ఉపసర్పంచ్ మూలజ్కర్ సుషీల్, బౌద్ధ భిక్షులు,సత్యవన్ చిక్టే హాజరయ్యారు.ఈ కార్యక్రమం లో సిద్ధార్థ మెండే, జ్ఞనోభా భలేరావు, అనిల్ వాగ్మారె, విట్టల్ పైటనే తదితరులు పాల్గొన్నారు.