50 గ్రామాలకు తొలగిన ముప్పు…  

స్వర్ణముఖి నదిలో వ్యర్ధాల తొలగింపు..

సిరా న్యూస్,తిరుపతి;
గత రెండు రోజులుగా  మిచాంగ్ తుఫాను ప్రజలను అతలాకుతలం చేస్తోంది. ప్రజలు ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న భయాందోళనలో ఉన్నారు. ఈ తరుణంలో తిరుచానూరు ముళ్ళపూడి మధ్య ప్రవహిస్తున్న స్వర్ణముఖి నదిలో వ్యర్ధాలు పేర్కొనిపోయి నీటి ప్రవాహానికి అడ్డుపడుతున్నాయి. వ్యర్ధాల వల్ల నీటి ప్రవాహం పెరిగితే తిరుచానూరుకు అటువైపు గల గ్రామాలకు రాక పోకలు తెగిపోతాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న తిరుచానూరు సర్పంచ్ కె రామచంద్రారెడ్డి పంచాయతీ కార్యదర్శి శివ శంకర్ రాజు సకాలంలో స్పందించి యుద్ధ ప్రాతి పథకాన స్వర్ణముకి నదిలో తూములకు అడ్డుపడుతున్న వ్యర్ధాలను, గుర్రపు డెక్కలను జెసిబిలను పెట్టి శుభ్రం చేయించారు. ఇందువల్ల 50 గ్రామలకు గల ముప్పు తప్పిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *