సిరా న్యూస్,నల్గోండ;
తన కొడుకు.. నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి కి మద్దతు ఇవ్వాలంటూ.. మాజీ సీఎల్పీ నేత సీనియర్ కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డి నల్గొండ జిల్లా సిపిఎం పార్టీ కార్యాలయానికి వచ్చారు. బిజెపి ప్రభుత్వo మరోసారి అధికారంలోకి వస్తె.. దేశంలో ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులా తయారైందని ఆయన అన్నారు. అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలను ప్రభుత్వ విభాగాలను మోదీ ప్రభుత్వం కట్టడి చేస్తుందని దుయ్యబట్టారు. కేంద్రంలో ఇండియా కూటమి భాగస్వామ్యంగా ఉన్న సిపిఎం పార్టీ.. తన కుమారుడికి మద్దతు ఇయ్యాలని ఆయన కోరారు.
=======