Vineeta Reddy: గ్రామాల్లో ప‌రిశుభ్ర‌తను పాటించాలి :  పంచాయతీ కార్యదర్శి వినీత రెడ్డి

సిరాన్యూస్‌, బేల‌
గ్రామాల్లో ప‌రిశుభ్ర‌తను పాటించాలి :  పంచాయతీ కార్యదర్శి వినీత రెడ్డి

గ్రామాల్లో ప్ర‌తి ఒక్క‌రూ ప‌రిశుభ్ర‌తను పాటించాలని జునోని గ్రామ పంచాయతీ కార్యదర్శి వినీత రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండ‌లంలోని జునోని గ్రామ పంచాయతీ పలు పనులను బుధ‌వారం ఆమె ప‌రిశీలించారు. ఈసంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా చూస్తామ‌ని తెలిపారు. స్వచ్ఛత పరిశుభ్రత ఎప్పటికప్పుడు రోజువారి పరిస్థితులను ప‌రిశీలిస్తున్నామ‌ని తెలిపారు.అనంత‌రం గ్రామంలో గ్రామ సభ నిర్వహించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడైతే అన్ని పనులు సక్రమంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *