– మద్దతు తెలిపిన ఎంపీ కేశినేని నాని
సిరా న్యూస్,విజయవాడ;
జన సందోహం,కోలాహలం మధ్య అట్టహాసంగా సాగిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ నామినేషన్ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ వైయస్సార్సీపీ లోక్ సభ అభ్యర్థి ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని), కుమార్తెలు కేశినేని హైమ, కేశినేని శ్వేత పాల్గోన్నారు.
కేశినేని శ్వేత, హైమ గార్లు ర్యాలీ మొదటి నుండి దేవినేని అవినాష్ కు మద్దతు తెలుపుతూ మేయర్ రాయన భాగ్యలక్ష్మి డిప్యూటీ మేయర్లతో కలిసి వైయస్సార్ కుటుంబ సభ్యులను ఉత్సాహపరుస్తూ ర్యాలీని ముందుకు నడిపించారు.
ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మీదుగా రామలింగేశ్వర నగర్, స్క్రూ బ్రిడ్జి, రాణి గారి తోట, సత్యం గారి హోటల్ మీదుగా డీసీఎం గ్రాండ్ వరకు భారీ ర్యాలీతో చేరుకున్నారు అడుగడుగునా హారతులు, పూల మాలలతో ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ గారికి బ్రహ్మరధం పట్టారుబంజారా నృత్యాలు, డప్పులు, డీజేలతో, జగనన్న పాటలతో యువకులతో ఉత్సాహంగా జరిగిన ర్యాలీకి నియోజకవర్గ నలుమూలల నుండి వైయస్సార్సీపీ కుటుంబ సభ్యులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ గారు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు,వివిధ హోదాల్లో వైయస్సార్సీపీ కోసం కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
========================