Kandi Srinivasa Reddy: ఆత్రం సుగుణ‌ను భారీ మెజార్టీతో గెలిపించండి: అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీ‌నివాస‌రెడ్డి

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
ఆత్రం సుగుణ‌ను భారీ మెజార్టీతో గెలిపించండి: అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీ‌నివాస‌రెడ్డి
ఆద‌రించండి.. అభివృద్ధి చేస్తా ఆత్రం సుగుణ‌
జైన‌థ్ మండ‌ల కేంద్రంలో కాంగ్రెస్ ప్ర‌చారం

ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీ‌నివాస‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్య‌ర్ది ఆత్రం సుగుణ ఎన్నిక‌ల ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతోంది .ఆదిలాబాద్ జిల్లా జైన‌థ్ మండ‌లకేంద్రంలో జిల్లా, మండ‌ల కాంగ్రెస్ నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు, అభిమానుల‌తో ప్ర‌చారం నిర్వ‌హించారు. నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు ప్ర‌చార క‌ర‌ప‌త్రాలు పంచుతూ స్టిక్క‌ర్లు అతికిస్తూ చేతి గుర్తుకు ఓటేయాల‌ని కోరారు. ఉమ్మ‌డి జిల్లా చ‌రిత్ర‌లో మొట్ట మొద‌టి సారిగా కాంగ్రెస్ పార్టీ ఒక మ‌హిళ‌కు టికెట్ ఇచ్చింద‌ని అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. ఆమెను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌న్నారు. ఈ పార్ల‌మెంట్‌ ఎన్నిక‌ల్లో బీజేపీ, కాంగ్రెస్‌కే పోటీ అని, బీఆర్ఎస్ ప‌ని ఎప్పుడో అయిపోయింద‌ని అన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామ‌ని గ‌ద్దెనెక్కిన బీజేపీ, మోడీ స‌ర్కార్‌ ప‌దేండ్ల‌లో ఎంత‌మందికి ఉద్యోగాలిచ్చార‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌లు అమాయ‌కులు కాద‌ని, ఎవ‌రు ఏమిటో వారికి ప‌క్కా తెలుస‌ని అన్నారు. అందుకే రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు ఘోరి క‌ట్టి కాంగ్రెస్ పార్టీకి ప‌ట్టం క‌ట్టార‌న్నారు. ఇప్పుడు అలాగే బీజేపీ ని కూడా ఓడించి తీరాల‌న్నారు. త‌న ప్రశ్నించే గొంతు ఆగ‌ద‌ని అన్యాయాన్ని ప్ర‌శ్నిస్తూనే ఉంటాన‌న్నారు. కాంగ్రెస్ పార్టీనే అనేక సంక్షేమ ప‌థ‌కాలు తీసుకొచ్చింద‌ని చెప్పారు. అలాంటి కాంగ్రెస్ ప్ర‌భుత్వం కేంద్రంలో కూడా ఏర్ప‌డేలా అంద‌రం కృషి చెయ్యాల‌న్నారు. మోదీ ప్ర‌భుత్వాన్ని ఓడిద్దామా అన్న‌ప్ర‌శ్న‌కు జ‌నం నుండి ఓడిద్దామ‌ని పెద్ద ఎత్తున ప్ర‌తిస్పంద‌న వ‌చ్చింది. గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమ‌న్నారు. ఇక్క‌డ ఆత్రం సుగుణను గెలిపించాల‌ని , జైన‌థ్ డ‌బ్బాలు తెరిస్తే కాంగ్రెస్ ఓట్లే ఉండాల‌ని పిలుపునిచ్చారు. సుగుణ‌క్క ఇప్ప‌టికే స‌ర్వేలో మూడు పాయింట్లు ముందుంద‌ని, ఇంకొంచెం క‌ష్ట ప‌డితే బీజేపీని ఓడించి కాంగ్రెస్ గెల్చుడు ఖాయమ‌న్నారు. అనంత‌రం ఆత్రం సుగుణ మాట్లాడుతూ త‌న‌కు ఒక్క అవ‌కాశం ఇవ్వాల‌ని, గెలిపించి పార్ల‌మెంట్‌కు పంపాల‌ని అభ్య‌ర్థించారు.పేదింటి బిడ్డ‌కు పేద‌ల క‌ష్ట‌సుఖాలు త‌న‌కు తెలుస‌ని, వారి ఎల్ల‌వేళ‌లా అందుబాటులో ఉంటూ వారి సేవ చేస్తాన‌ని తెలిపారు. తాను ఆశ‌తో రాలేదు ఆశ‌యం కోసం వ‌చ్చినట్టు తెలిపారు. సీత‌క్క స్పూర్తి తో రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌న్నారు. ఆద‌రించండి ఆశీర్వ‌దించండి అంటూ ఓట‌ర్లు సుగుణ అభ్య‌ర్దించారు. బీఆర్ ఎస్ బీజేపీ ఇద్ద‌రు అభ్య‌ర్ధులు ఇద్ద‌రు ఒక్క‌టేన‌ని వారికి ఓటేసి మీ ఓటును వృధా చేసుకోవ‌ద్ద‌ని కోరారు. కొంగు చాచి అడుగుతున్న ఒక్క అవ‌కాశ‌మివ్వండ‌ని కోరారు. అనంతరమ్ నిరాల లొను ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ఎంపీ. అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జైనథ్ మండల కాంగ్రెస్ నాయకులు జైనథ్ మండల జడ్పీటిసి తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి, అల్లూరి అశోక్ రెడ్డి, పుండ్రు రవికిరణ్ రెడ్డి, బద్ధం సురేష్ రెడ్డి, జైనాథ్ ఎంపీటీసీ కొడిచెర్ల సుదర్శన్, ఎంపీటీసీ జయమాల, జైనథ్ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *