ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వద్ద ఉద్రిక్తత

సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఐపీఎల్ టికెట్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటుందని ఆరోపిస్తూ యూత్ కాంగ్రెస్ శ్రేణులు ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద ఆందోళనకు దిగాయి. హెచ్సీయే అధ్యక్షుడు జగన్మోహన్రావు దిష్టిబొమ్మను యూత్ కాంగ్రెస్ నేతలు దహనం చేసారు. నేడు సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజ్ బెంగళూరు ల మధ్య జరగనున్న మ్యాచ్ పై యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. తక్షణమే హెచ్సియే A అధ్యక్షుడు జగన్మోహన్ రావు రాజీనామా చేయాలంటూ నిరసనలు వ్యక్తం చేసారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డిని, యూత్ కాంగ్రెస్ శ్రేణులను రాచకొండ పోలీసులు అరెస్టు చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *