సిరాన్యూస్, ఉట్నూర్
ఆదిలాబాద్ పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తాం
* బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్య జాన్సన్ నాయక్
ఆదిలాబాద్ పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తామని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్య జాన్సన్ నాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఆత్రం సక్కు గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బూత్ స్థాయిలో నాయకులందరూ ప్రజలతో మమేకమవ్వాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఉట్నూర్ మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.