సిరాన్యూస్, సైదాపూర్
రేపు సైదాపూర్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ రాక
సైదాపూర్ మండల కేంద్రంలో నిర్వహించే పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ రానున్నట్లు సైదాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంత సుధాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు హాజరవుతున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం 10:30 లకు వస్తున్నట్లు తెలిపారు. అనంతరం గాంధీ విగ్రహం నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ ఉంటుందని, అనంతరం కార్నర్ మీటింగ్ ఉంటుందని ఆయన తెలిపారు. కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.